Thursday, 30 July 2026 11:56:28 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నాగుల వెల్టూరు లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వేలూరు కేశవ చౌదరి, రేవతి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న జయంతి వేడుకల్లో లో ఆనం లీలా కైవల్య రెడ్డి

Date : 12 May 2026 05:13 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 12 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. సోమశిల జలాశయం ప్రాజెక్టు డైరెక్టర్ వేలూరు.కేశవ చౌదరి వారి సతీమణి పార్లమెంటరీ విభాగపు నాయకురాలు కేశవ రేవతి చౌదరి దంపతుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె లీలా కైవల్యా రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు..మొదట కేశవ చౌదరి, రేవతి దంపతులు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనం లీల కైవల్యా రెడ్డి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1001 టెంకాయల మొక్కుబడి ప్రారంభించి టెంకాయలను స్వామి వారికి సమర్పించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, అనంతసాగరం తెలుగుదేశం పార్టీ నేత సునీత, గ్రామ నేతలు గ్రామస్తులు తదితరులు భారీగా హాజరయ్యారు. ఆనం లీలా కైవలా రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నాగుల వెల్టూరు గ్రామ ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన కేశవ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేశవ చౌదరి మాట్లాడుతూ భగవాన్ వెంకయ్య స్వామి జన్మస్థలమైన నాగుల వెల్టూరు గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ గ్రామంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన వారికి, కార్యక్రమానిర్వాహానకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :