నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : అంగళ్ళు సమీపంలో ని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ తో మదనపల్లికి చెందిన ఆరన్ సైంటిఫిక్ వారు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు (ఎంఓయూ) కళాశాల ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ ఒప్పందము ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధన అవకాశాలు, ఇంట్రెన్షిప్, సాంకేతిక అవసరాలు, నిపుణులద్వారా వర్కుషాప్ నిర్వహణ చేయడంతో పాటు ఇంట్రెన్షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సర్టిఫికెషన్ ప్రోగ్రాం మొదలైనవి ముఖ్య అంశాలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. విద్యార్థులకు 4 వారాల నుండి 6 వారాలు మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 4 వారాలు నుండి 6 నెలల వ్యవదిలో ఇంటర్న్ షిప్ ఉంటుందని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆరన్ సైంటిఫిక్ డైరెక్షర్ డాక్టర్ అరుణ్ కుమార్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్,డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంక్ రాయ్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అసిస్టెంట్ డైరెక్టర్&ఇండస్ట్రీ రీ లేషన్ ఆఫీసర్ పి. ఎం. బాలాజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. భాస్కరన్ పాల్గొన్నారు.
Admin
Namitha News