Saturday, 13 June 2026 10:04:41 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్

బిసివై అధినేత రామచంద్ర యాదవ్ ను, బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ల ఆత్మీయ కలయిక

Date : 11 June 2026 11:08 PM Views : 47

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11: వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాధికారత, రాజ్యాధికారం కోసం బిసి సంఘాల ఐక్యత ఎంతో అవసరం అని బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్, బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‌శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు బిసి హక్కుల పోరాట సమితి నాయకులు సాదర స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ‌ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించి, పలు విషయాలను పంచుకున్నారు. బిసిలు అందరూ తమ విభేదాలను పక్కన పెట్టి, ఒకే వేదికపైకి రావడం ద్వారా మాత్రమే చట్టసభల్లో సముచిత స్థానం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుకోగలరని అభిలాషించారు. బీసీ ఐక్యత రాజ్యాధికార సాధన, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే అన్ని కులాల విభేదాల వీడి ఐక్యతగా వుండాలని అన్నారు. బిసిల పేరు చెప్పుకునే అధి నాయకులు స్వప్రయోజనాలు పక్కనపెట్టి, సామాజిక న్యాయం కోసం కులాలకతీతంగా కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ‌ బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత లభించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పుంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిసి హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామాంజులు, చిన్న రెడ్డెప్ప, సుబ్బారాజు, సిద్దయ్య, మోహన్, శ్రీనివాసులు, చంద్రయ్య, జయన్న, గంగిరెడ్డి, మోహన్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్, కుమార్ తదితరులు బోడే రామచంద్ర యాదవ్ ను కలవడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :