నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11: వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాధికారత, రాజ్యాధికారం కోసం బిసి సంఘాల ఐక్యత ఎంతో అవసరం అని బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్, బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు బిసి హక్కుల పోరాట సమితి నాయకులు సాదర స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించి, పలు విషయాలను పంచుకున్నారు. బిసిలు అందరూ తమ విభేదాలను పక్కన పెట్టి, ఒకే వేదికపైకి రావడం ద్వారా మాత్రమే చట్టసభల్లో సముచిత స్థానం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుకోగలరని అభిలాషించారు. బీసీ ఐక్యత రాజ్యాధికార సాధన, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే అన్ని కులాల విభేదాల వీడి ఐక్యతగా వుండాలని అన్నారు. బిసిల పేరు చెప్పుకునే అధి నాయకులు స్వప్రయోజనాలు పక్కనపెట్టి, సామాజిక న్యాయం కోసం కులాలకతీతంగా కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత లభించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పుంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిసి హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామాంజులు, చిన్న రెడ్డెప్ప, సుబ్బారాజు, సిద్దయ్య, మోహన్, శ్రీనివాసులు, చంద్రయ్య, జయన్న, గంగిరెడ్డి, మోహన్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్, కుమార్ తదితరులు బోడే రామచంద్ర యాదవ్ ను కలవడం జరిగింది
Reporter
Namitha News