నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తంబళ్లపల్లె మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంద్ర కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఇంచార్జ్ ఎంపీడీవో ఎంవి ప్రసాద్ కోరారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధ్యాయులు,సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పలు శాఖల అధికారులు గంటపాటు యోగ నిర్వహించారు. ఎంఈఓ త్యాగరాజు మాట్లాడుతూ యోగ నిర్వహించడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరు తమ జీవన శైలిలో యోగాకు కొంత సమయం కేటాయించాలన్నారు. సచివాలయాల పరిధిలో యోగ నిర్వహించి ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, అధికారులు గోపీనాథ్,విజయ్, యోగా ట్రైనర్లు, కార్యదర్శిలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News