నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 14 : తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ లోని గోవిందువారిపల్లె, గిరిజన తండాలు, గంగిరెడ్డిపల్లి లలో పలుచోట్ల సిమెంట్ రోడ్లు, మురికినీటి కాలువలు లేక మురికి నీరు రోడ్లమీద పారుతున్నాయి. వర్షాకాలం ఈ రోడ్లు బురదమయంగా మారి నడవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి గ్రామంలో మురికినీటి కాలువలతో పాటు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News