నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : అధికార యంత్రాంగం చేస్తున్న జనగణన సర్వే ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమం జరుగుతుందని తప్పులు లేకుండా వికాసయిన ఓటర్ల జాబితా చేపట్టాలని స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ రోడ్డు, మసీదు వీధులలో జరుగుతున్న జనగణన సర్వే ను పరిశీలించారు. గత జనాభా లెక్కలకు నేటికీ తేడా కనిపిస్తే వెంటనే నీ వెరిఫికేషన్ చేసుకొని ఖచ్చితమైన జనాభా లెక్కింపులు చేయాలని సూచించారు. ఎన్నుమలేటర్లు ఇంటింటికి తిరిగి 34 ప్రశ్నలతో కూడిన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, కాలాలు వేసిన ఇళ్లను వేరువేరుగా ఓటర్లు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ రవీంద్రనాయక్, ఏపీవో అంజనప్ప, సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News