నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకల చెర్వు - జూన్ 15 : ములకలచెరువు మండలం గూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోటపల్లి గ్రామ త్రాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ చొరవతో గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో బోర్ మోటార్కు వెంటనే మరమ్మతులు చేయించారు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు పాల్గొని మరమ్మతు పనులను పర్యవేక్షించారు. బోర్ మోటార్ను తిరిగి పనిచేసే విధంగా మరమ్మతులు చేయడంతో గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించబడింది
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను తక్షణమే పరిష్కరించిన జనసేన పార్టీ నాయకత్వానికి, గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్కు, అలాగే గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Reporter
Namitha News