Thursday, 30 July 2026 08:13:56 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గుండ్లపల్లి లో ప్రకృతి వ్యవసాయం తో వికసించిన ప్రకృతి వ్యవసాయ ఫలాలు

ఫోర్డ్ సంస్థ అవగాహనే ఆదర్శం

Date : 21 March 2026 09:00 PM Views : 315

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 21ః రసాయన ఎరువులు, క్రిమిసంహారాలతో పండిన ఫల సాయంతో నేటి సమాజం ఆరోగ్యాలు క్షీణించి నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో ఎడారిలో ఒయాసిస్ లా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ప్రేరణతో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు తంబళ్లపల్లెలో పోర్డు సంస్థ అవగాహనతో పురుడు పోసుకోవడం హర్షనీయం. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె పంచాయతీలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం పై స్థానిక రైతులకు రైతు యాత్రలు,అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం నింపి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడవడానికి పునాదులు వేశారు. ఫోర్డ్ సంస్థ చేసిన ప్రయత్నం ఫలించి నేడు గుండ్లపల్లి పంచాయతీ లో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పంటల ఫలాలతో సత్ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ప్రకృతి వ్యవసాయం లో భాగంగా సేంద్రియ ఎరువులు, పేడ ఎరువు, కషాయాలతో వేరుశనగ, మామిడి, మొక్కజొన్న, సుమారు 30 రకాల చిరుధాన్య పంటలు, ఆకుకూరలు, కూరగాయల పంటలు పండించడంతోపాటు అధిక దిగుబడి సాధించారు. ఇందులో భాగంగా శనివారం ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ, రమణ, సంపూర్ణ, హేమంత్, ఏ పి సి ఎన్ ఎఫ్ ప్రతినిధి రాజు గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అభినందించారు. రైతు నరసింహులు వేసిన మామిడి, అంతర్ పంట వేరుశనగ ఎకరాకు 15 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పడం తో ప్రకృతి వ్యవసాయం లో నైతిక విజయం సాధించి గుండ్లపల్లి రైతులు ఆదర్శంగా నిలిచినట్లు లలితమ్మ కొనియాడారు. అదేవిధంగా మరో రైతు మనోహర్ తనకున్న కొద్దిపాటి పొలంలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండించి లబ్ధి పొందడం విశేషం. ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుల పొలాలు భూసారం పెరిగి పండిన ఫల సాయం మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ కలుగుతుందని వారికి హితబోధ చేశారు. ఆమె వెంట ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :