నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఫిబ్రవరి 01 : మదనపల్లి సమీపం గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో గ్రామజ్యోతి సొసైటీ (మదనపల్లి), ది మూమెంట్ గ్లోబల్ ఫౌండేషన్ (ముంబై) వారి సహకారంతో మానవ అక్రమ రవాణా, మహిళలు–పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మిట్స్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. కమల్ బాషా కార్యక్రమాన్ని ప్రారంభించారు., యూనివర్సిటీ నుండి అంగళ్ళు కూడలి వరకు ర్యాలీ సాగించి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి సొసైటీ ప్రతినిధి బి. శుభద్ర మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, చిన్నపిల్లల అపహరణ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలతో పాటు నకిలీ ఏజెంట్లను నమ్మి కువైట్, సౌదీ, ఖతార్ వంటి దేశాలకు వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముదివేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల అపహరణ, ర్యాగింగ్, సైబర్ నేరాలు వంటి ఘటనలు జరిగితే 100, 181, 1930, 1098 నంబర్లకు వెంటనే ఫోన్ చేయాలని సూచిస్తూ పోలీస్ శాఖ తక్షణ సహాయం అందిస్తుందని తెలిపారు. ర్యాలీ అనంతరం గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ ఆఫీసర్ పి.రాజేష్ మాట్లాడుతూ ర్యాలీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కోఆర్డినేటర్ పి. రాజేష్, గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర, ముదివేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News