Friday, 31 July 2026 01:00:03 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

శివరాత్రి సందర్భంగా శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా అన్నదానం

4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ

Date : 16 February 2026 02:53 PM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చౌడేశ్వరి సర్కిల్ సమీపం నీరుగట్టువారిపల్లిలో వెలసిన శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు నిర్వహించగా, పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా అన్నదాన ఏర్పాట్లు చేసి, సుమారు 4 వేల నుంచి 5 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకులు సమన్వయంతో భక్తులకు క్రమపద్ధతిలో భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, దండు రామాంజులు మాట్లాడుతూ...మహాశివరాత్రి వంటి పవిత్ర పర్వదినాల్లో అన్నదానం చేయడం గొప్ప పుణ్యకార్యమని తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, చేనేత కార్మిక యూనియన్ ప్రెసిడెంట్ ముష్టూరు రామ్మోహన్, కదిరి రామ్మోహన్, చెంగల సుబ్రహ్మణ్యం, దండు ఆనంద్ తదితరులు పాల్గొని అన్నదాన సేవలో చురుకుగా పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: