Thursday, 16 April 2026 08:01:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎస్పీ

Date : 02 December 2025 04:42 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా పోలీసు కుటుంబాలకు ఆరోగ్య భరోసా పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎస్పీ.. మెరుగైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వెల్లడి... అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం ఉదయం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సంక్షేమమే జిల్లా పోలీసు శాఖకు ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు... పోలీసు సిబ్బందికి వారి కుటుంబాలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు...వెల్ఫేర్ ఆసుపత్రి కేవలం భవనం కాదు, మా సేవా యోధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తీసుకున్న మొదటి ఆరోగ్య భరోసా" అన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు మరియు అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. తరచుగా ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన డిఎంహెచ్ఓ, రాయచోటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి , రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, డి.లక్ష్మీప్రసాద్, డాక్టర్లు రామరాజు, రాధిక, అబ్దుల్ లతీఫ్, ఏఏఓ జె.త్రినాథసత్యం, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :