Thursday, 30 July 2026 08:52:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Date : 08 January 2026 06:53 PM Views : 302

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బిటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన వ్యవహారాల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12 న నిర్వహించనున్న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. లైఫ్ మెసేజ్ అఫ్ స్వామి వివేకానంద ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్, వికసిత్ భారత్-2047, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ది సొసైటీ బిల్డింగ్, డ్రగ్ అడిక్షన్ - ఇట్స్ అఫెక్ట్స్ అనే అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, చర్చాకార్యక్రమం మొదలైన విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు. కో-ఆపరేటివ్ శాఖకు చెందిన దుర్గ వివేకానందుని జీవిత ఘట్టాలను వివరించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్టెప్ అధికారులు వి.వి.నారాయణ, ఫల్గుణ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ శైలజ సి.ఎస్, డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్, డాక్టర్ జి.చిన్నారెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: