నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని అధ్యాపకుల కోసం “ఇన్నో ట్రైబ్ ప్రారంభం” అనే అంశంపై ప్రత్యేక అవగాహన మరియు ఇంటరాక్టివ్ లెక్చర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంస్థ నుండి విజయవంత్ మాథూర్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిల్వియా పి – ప్రోగ్రామ్ అసోసియేట్, పి. వినోద్ కుమార్ – ప్రోగ్రామ్ అసోసియేట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవంత్ మాథూర్ మాట్లాడుతూ యువతలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమని, విద్యాసంస్థల్లో ఇన్నోవేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ సంస్కృతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. “ఇన్నో ట్రైబ్” కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లభించే అవకాశాలు, స్టార్టప్లకు అందించే మద్దతు పథకాలు, ఇంక్యూబేషన్ కేంద్రాల సహకారం వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే విద్యాసంస్థలు మరియు ఇన్నోవేషన్ హబ్ల మధ్య పరస్పర సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిట్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చేపడుతున్న ఇన్నోవేషన్, స్టార్టప్, ఎంట్రప్రెన్యూర్షిప్ మరియు ఇంక్యూబేషన్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఏం. బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ అనంతరామన్, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News