నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 ః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం కేసు లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము లకు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తంబళ్లపల్లె కోర్టు 480 సెక్షన్ కింద ఆన్ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములు గతంలో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీన అక్కడి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మొలకలచెరువు లో నకిలీ మద్యం కేసులో కీలక మొదటి ముద్దాయిగా నిలిచిన జనార్దన్ రావు వాంగ్మూలంతో మాజీ మంత్రి జోగి రమేష్ ఏ 32, ఆయన సోదరుడు జోగి రాము ఏ33 నిందితులుగా చేర్చి గత ఏడాది నవంబర్ మూడవ తేదీన పీ.టి వారెంట్ పై ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. జోగి బ్రదర్స్ కు ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు ఆయన విషయం పాఠకులకు తెలిసిందే. గత 85 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి సోదరులకు తంబళ్లపల్లె కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో వారికి భారీ ఊరట లభించింది. జోగి సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు
Reporter
Namitha News