Friday, 31 July 2026 05:44:09 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు తంబళ్లపల్లె కోర్టు బెయిల్ మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న వైకాపా నాయకులు

Date : 23 January 2026 08:37 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 ః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం కేసు లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము లకు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తంబళ్లపల్లె కోర్టు 480 సెక్షన్ కింద ఆన్ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములు గతంలో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీన అక్కడి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మొలకలచెరువు లో నకిలీ మద్యం కేసులో కీలక మొదటి ముద్దాయిగా నిలిచిన జనార్దన్ రావు వాంగ్మూలంతో మాజీ మంత్రి జోగి రమేష్ ఏ 32, ఆయన సోదరుడు జోగి రాము ఏ33 నిందితులుగా చేర్చి గత ఏడాది నవంబర్ మూడవ తేదీన పీ.టి వారెంట్ పై ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. జోగి బ్రదర్స్ కు ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు ఆయన విషయం పాఠకులకు తెలిసిందే. గత 85 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి సోదరులకు తంబళ్లపల్లె కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో వారికి భారీ ఊరట లభించింది. జోగి సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: