Tuesday, 09 June 2026 09:42:32 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు తంబళ్లపల్లె కోర్టు బెయిల్ మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న వైకాపా నాయకులు

Date : 23 January 2026 08:37 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 ః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం కేసు లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము లకు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తంబళ్లపల్లె కోర్టు 480 సెక్షన్ కింద ఆన్ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములు గతంలో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీన అక్కడి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మొలకలచెరువు లో నకిలీ మద్యం కేసులో కీలక మొదటి ముద్దాయిగా నిలిచిన జనార్దన్ రావు వాంగ్మూలంతో మాజీ మంత్రి జోగి రమేష్ ఏ 32, ఆయన సోదరుడు జోగి రాము ఏ33 నిందితులుగా చేర్చి గత ఏడాది నవంబర్ మూడవ తేదీన పీ.టి వారెంట్ పై ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. జోగి బ్రదర్స్ కు ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు ఆయన విషయం పాఠకులకు తెలిసిందే. గత 85 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి సోదరులకు తంబళ్లపల్లె కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో వారికి భారీ ఊరట లభించింది. జోగి సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :