నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 04 : వంట నిర్వాహకులు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు రుచిగా శుచిగా ఉండాలని ఎంఈఓ నాగ సుబ్బరాయుడు సూచించారు. గురువారం తంబళ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం వంట నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వంటగదిని శుభ్రంగా ఉంచుతూ మరియు కూరగాయలు శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా భోజనం రుచిగా వండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వంట నిర్వాహకులకు వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో రేణుమాకులపల్లి భాగ్యమ్మ మొదటి స్థానం, రెండో స్థానం శ్రీనివాస కాలనీ ఈశ్వరమ్మ, మూడవ స్థానం తంబళ్లపల్లి హరిజనవాడ లక్ష్మీదేవి లు నిలిచారు. పోటీలలో గెలిచిన వంట నిర్వాహకులకు ఎంఈఓ నాగ సుబ్బరాయుడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.సి. సి.ఆర్.ఎం.టి, వంట నిర్వాహకులు పాల్గొన్నారు
Reporter
Namitha News