నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 ః తంబళ్లపల్లె మండలంలోని ఇంటర్ పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ 73%, సెకండ్ ఇయర్ 70%, కస్తూరిబా బాలికల గురుకులంలో ఫస్ట్ ఇయర్లో 90.4%, సెకండ్ ఇయర్ లో 70%, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో 27%, సెకండ్ ఇయర్లో 64% ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్లో కీర్తన (ఎంపీసీ) 463/470 మార్కులు,వేదశ్రీ (బైపిసి) 438/455, పూజిత (ఎం ఇ సి) 445/500, నందిని (సి ఈ సి) 480/500, సెకండ్ ఇయర్లో జోషిత (ఎంపీసీ)975/1000, గీతాంజలి (ఎంపీసీ) 888/1000, బి ప్రవల్లిక (ఎం ఇ సి) 944/1000, పావని (సిఇసి) 935/1000, కస్తూరిబాలో ఫస్ట్ ఇయర్లో లిఖిత(బైపీసీ) 420/455, సెకండ్ ఇయర్ లో వైష్ణవి (బైపిసి) 968/1000, జూదు (బైపిసి) 920/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఫస్ట్ ఇయర్లో కల్పన (సిఇసి) 450/500, రేఖ (ఎంపీసీ) 417/470, జగదీష్ (సిఇసి) 392/500, సెకండ్ ఇయర్ లో భాను ప్రకాష్ (ఎంపీసీ) 913/1000, రూకియా తప్సం (ఎంపీసీ) 901/1000, దివ్యశ్రీ (ఎంపీసీ) 900/1000 మార్కులు సాధించారు. మోడల్ స్కూల్ లో ఇంటర్ విద్యార్థులు ప్రతిభ కనబరడంపై ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. అదేవిధంగా కస్తూరిబా బాలికల ఉత్తమ ప్రదర్శన పై ప్రిన్సిపాల్ శ్రీమతి ఉపాధ్యాయులను అభినందించారు
Reporter
Namitha News