Friday, 31 July 2026 10:40:38 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు సహించేది లేదు - టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

Date : 31 December 2025 06:31 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని అలాంటిది పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె మండల కేంద్రం అంబేద్కర్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి సారథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు విశాఖలో సాఫ్ట్వేర్ రంగం లో దూసుకుపోతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు తోపాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. పార్టీ పదవులు ఊరికే రావని పార్టీ కోసం కష్టపడి త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించనని ఏ కార్యక్రమం జరిగిన ఏకతాటిపై జరగాలని సూచించారు. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీకి కంచుకోటని అలాంటిది మనలో గ్రూపు రాజకీయాలు చేస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. నాయకులు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానని ఐకమత్యంతో టిడిపి కుటుంబ సభ్యులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, ములకలచెరువు సింగల్ విండో ప్రెసిడెంట్ త్యాగరాజు,రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్,బిసి నాయకుడు పురుషోత్తం, క్లస్టర్ ఇన్చార్జి బేరి శ్రీనివాసులు,రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, సోమశేఖర్,తెలుగు యువత నరసింహులు, వీరాంజనేయులు, కాలా నారాయణ, ఎస్టీ నాయకుడు వెంకటరమణ, రామచంద్ర , ఆనంద్ రెడ్డి , కందిమడుగు సోమశేఖర్ ,సురేంద్ర , మండలములోని వందలాది గా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :