నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 29 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి తాసిల్దార్ శ్రీనివాసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పంచాయతీ భవనానికి కేటాయించిన స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమణకు ప్రయత్నించగా అధికారులు, కూటమి నాయకులు అడ్డుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ రావడంతో చివరికి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎస్సై అనిల్ కుమార్, ఇంచార్జ్ ఎంపీడీవో థామస్ రాజా, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, తదితరులు సమావేశంలో తాసిల్దార్ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి ప్రభుత్వం దేనని ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదని సదరు ఆక్రమణ వ్యక్తికి నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో స్థలం ఖాళీ చేయించి భవన నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బిజెపి రామస్వామి రెడ్డి, జనసేన సిద్ధమల్ రెడ్డి, ఆనంద రెడ్డి, రామచంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News