నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 తంబళ్లపల్లె లోని శాఖా గ్రంధాలయం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం గ్రంథాలయ అధికారి జిలాని భాష ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్కూల్ హెడ్మాస్టర్ రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 14 మన దేశ దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయన దేశ స్వాతంత్రానికి చేసిన పోరాటం, నవభారత నిర్మాణంలో ఆయన పాత్ర, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News