నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించడానికి సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలని ఏవో రమణ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె వ్యవసాయ క్షేత్రంలో మండలంలోని గ్రామ వ్యవసాయ అధికారులు, ఏపీ ఎన్ ఎస్ సి సిబ్బందికి విత్తన గుళికలు (బంతులు) తయారీ విధానం పై జిల్లా ట్రైనర్ చిరంజీవి ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు. సేంద్రియ విత్తన శుద్ధి ద్వారా పంట నాశించే పురుగులు, తెగుళ్లు, కీటకాలు, సిలింద్రాల నిర్మూలన తో పాటు ఆరు మాసాల వరకు విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. మొలక శాతం పెరిగి వ్యాధులనుండి రక్షింపబడి దిగుబడి పెంచడంతో పాటు జీవన ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, సుప్రియ,రెడ్డి శేఖర్, సుధాకర్, సురేంద్ర, తరుణ్, నవ్య శ్రీ, రత్నమాలిక, శిరీష, వనిత, విద్యాసాగర్, శ్యామల, ఏపీ ఎన్ ఎస్ సి ప్రతినిధులు రఘునాథ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News