Tuesday, 09 June 2026 08:20:40 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

వాహన చోదకులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యస్.ఐ. అనిల్ కుమార్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా అవగాహనా కార్యక్రమం

Date : 15 January 2026 08:48 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 15 : తంబళ్లపల్లి మండలంలోని వాహన చోదకులు కచ్చితంగా రోడ్డు భద్రత పాటించి క్షేమంగా ఇళ్లకు చేరాలని ఎస్సై టి అనిల్ కుమార్ హితబోధ చేశారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. వాహనం డ్రైవర్లు ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ వాడాలని, అతివేగం, మద్యం సేవించి బండి నడపడం చేయరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలైన జూదం, కోడి పందాలు, సైబర్ నేరాలు, గంజాయి, బెల్ట్ షాప్ నిర్వహణ, బహిరంగ మద్యం సేవించడం, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల ఈవిటీజింగ్ లాంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రజలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. పై అసాంఘిక కార్యక్రమాలపై మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలు సైతం సహకరించి ఈ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి నేర రహిత సమాజం కోసం తమతో కలసి రావాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనం డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :