నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 27 : వైఎస్ఆర్సిపి జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీగా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయవాది బుక్కే శంకర్ నాయక్ ను అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన వైకాపా ఆవిర్భావం నుండి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి చేసిన కృషికి పార్టీ అధిష్టానం లీగల్ కమిటీకి ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన తల్లి కోటకొండ ఎగువ సుగాలి తండా సర్పంచిగా కొనసాగుతున్నారు. తన ఎంపికకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని పార్టీ అదేశాల మేరకు భవిష్యత్తులో వైకాపా అభివృద్ధి కోసం కృషి చేస్తానని విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News