నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు,సుజన్ రాజు లకు ఘనంగా జన్మదిన వేడుకలు.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు చౌడేపల్లి మండలం వాస్తవ్యులు బెంగళూరు ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు మరియు సుజన్ రాజు ల పుట్టినరోజు వేడుకలను రాజు క్షత్రియ మరియు స్నేహితులు, అభిమానులతో కలసి భారీగా బాణా సంచా పేల్చి,పుంగనూరు, చౌడేపల్లి మండలాల లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి బెంగళూరు పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన పుట్టిన ఊరిని మరువకుండా గ్రామాలలో నిరుద్యోగ యువత కు ఉద్యోగం,నిరు పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం,విద్య వైద్య సేవలు ఇలా పలురకాలు అందరికి ఆదర్శం గా నిలిచారని ఈ రోజు వారి జన్మదిన వేడుకలకు పట్టణం లోని ఎన్ టి ఆర్ సర్కిల్,అనాధ శ్రమలలో అన్నదాన కార్యక్రమం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రేడ్, పండ్లు పంపిణి నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వెంకటేశ్వర స్వామి అశీసులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఇంకా మరింత గా ఉన్నత స్థాయికి ఎదిగి నిరుద్యోగ యువతకు చెయుతను అందించాలని కోరారు.జన్మదిన వేడుకలలో స్టేట్ మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి మొదలియార్,అర్జున్ రాజు,బాల గుర్రపల్లి నవీన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, లక్ష్మణ్ రాజు,సతీష్ కుమార్ రాజు,భార్గవ్, గూడూరు పల్లి మణి,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News