నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 30 : తనపై అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి మహిళా నేత సిద్ధమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె టిడిపి నేతలతో కలిసి హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు కు లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. గత వైకాపా అరాచక పాలనలో పార్టీ కోసం నా భర్త మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తో బాటు స్థానిక నాయకుల సహకారం తో ఎదుర్కొని కేసులు పెట్టించుకుని కోర్టు చుట్టూ తిరుగుతున్నామన్నారు. పార్టీ అధిష్టానం ఏ నాయకుడు కు టికెట్ ఇచ్చిన వారి కోసం కష్టపడ్డామని ఏ కార్యక్రమం జరిగిన అందరి సహకారంతో విజయవంతం చేశామని చెప్పారు. మా ఎదుగుదల ఓర్వలేని కొంతమంది కోవర్టులు మేము డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి అవమాన పరుస్తున్నారని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారు వెంట మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, క్లస్టర్ ఇన్చార్జీలు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ, పురుషోత్తం, వీరాంజనేయులు, నరసింహులు,కోటకొండ రెడ్డప్ప, నిజాముద్దీన్, నరసింహనాయుడు, మధు నాయుడు, సురేంద్ర, మోహన్ రెడ్డి, వెంకటరమణ, రాము, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News