నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో లతీఫ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వికలాంగుల హక్కుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లతీఫ్ ఖాన్ , ఎమ్మార్పీఎస్ నాయకులు, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
Admin
Namitha News