Thursday, 30 July 2026 01:53:57 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ విద్యార్థులకు విద్యుత్ ఉత్పత్తి & సరఫరా అంశాలపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారులు

Date : 03 February 2026 05:27 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 04 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం వారు విద్యార్థులకు విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలికిరి సబ్ స్టేషన్ ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.వి. మహేష్ బాబు పాల్గొని విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రిడ్ వరకు జరిగే ప్రక్రియలు, ఏపీ జెన్‌కో, ఏపీ డిస్కమ్, ఏపీ ట్రాన్స్‌కో శాఖల విధులు, 11 కే.వి., 33 కే.వి., 130, 220, 400 కే.వి. టవర్ల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సబ్‌స్టేషన్లు, హై టెన్షన్ టవర్లు, వోల్టేజ్ స్థాయిలపై అవగాహన పెంచుకోవడం ద్వారా పరిశ్రమల్లో ఉపయోగించే నిజమైన సాంకేతికతను అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. అల్ట్రా హై వోల్టేజ్ (UHT) సబ్‌స్టేషన్లు ఎక్కువ దూరాలకు భారీగా విద్యుత్‌ను సమర్థవంతంగా ప్రసారం చేయడంలో ముఖ్యమని, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో 765 కే.వి. ఏసీ లేదా 800 కే.వి. హెచ్‌వీడీసీ అల్ట్రా హెవీ టెన్షన్ సాంకేతికత అవసరమైందని, అధిక వోల్టేజ్ వల్ల నష్టాలు తగ్గి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ అంశాలపై పట్టు సాధించడం వల్ల గ్రిడ్ సిస్టమ్, పవర్ క్వాలిటీ, నష్టాల నియంత్రణ వంటి కీలక విషయాల్లో నైపుణ్యం పెరిగి, భవిష్యత్తులో పవర్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్,నిర్వహణ ఇంజనీర్ వంటి పాత్రల్లో రాణించే అవకాశం లభిస్తుంది అని అన్నారు. విద్యార్థులు పరిశ్రమల సందర్శనలో భాగంగా సమీప విద్యుత్ కేంద్రాలను సందర్శించడం ద్వారా విద్యుత్ పరికరాల వాస్తవ పనితీరు పై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ వంటి విద్యుత్ శాఖల పనితీరు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, ఈ.ఈ.ఈ. విభాగాధిపతి డాక్టర్ ఎ.వి. పవన్ కుమార్, కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :