Thursday, 30 July 2026 02:11:58 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి - నిసార్ అహమ్మద్

Date : 30 December 2025 04:37 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె రూరల్ అమ్మచెరువుమిట్ట కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార గుండా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్దానిక వైసిపి నాయకులు నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం పూజారులు శఠగోపం తలపై పెట్టి దీవెనలు అందించారు. అనంతరం భక్తులకు నిసార్ అహ్మద్ చేతులమీదుగా అన్నదానం నిర్వహించారు. ‌ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి విశేషమైన విశిష్టత ఉందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోటి పుణ్యాలు ఇస్తుందన్నారు. ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు అని ముక్కోటి ఏకాదశి అంటారని వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడనే ప్రతీతి అన్నారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉందన్నారు. హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారని అన్నారు. నిసార్ అహ్మద్ తోపాటు ఎస్.రమేష్, దండు రామాంజులు, కృష్ణారెడ్డి, రామమోహన్, మధు, కౌన్సిలర్లు శివ, ఈశ్వర్ నాయక్, పూజారి చరణ్, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి, మహేష్ కొత్తపల్లె, యూనస్, సాదిక్, యాసిన్, సమద్, పురాణం వెంకట్రమణ, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :