నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు... మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలు స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు... స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడాల్లి నుండి పెద్ద ఎత్తున మేల తాళాలు, బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు... ఎన్విఆర్ కళ్యాణమండపంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్లు, పట్టణ ప్రముఖులు, ముఖ్య అతిథులు సభలో ప్రసంగించారు.. వందేళ్లు ఒక మునుపు 30 మంది సభ్యులు 400 రూపాయలతో ప్రారంభించిన మదనపల్లి టౌన్ బ్యాంక్ నేడు 125 కోట్ల డిపాసిట్లు, 100 కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలోని గుర్తింపు కలిగిన బ్యాంకుగా పేరు సంపాదించుతుందని అన్నారు.. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లె ను జిల్లాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలియజేశారు.. రానున్న కాలంలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి టౌన్ బ్యాంకు మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు... ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ సీఈవో ప్రసాద్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు...
Reporter
Namitha News