నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 28 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఓ రైతు కు చెందిన స్కూటర్ డిక్కీలో పాము ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆదివారం ఉదయం క్రాస్ రోడ్డు అమృత హాస్పిటల్ ఎదురుగా రైతు తన స్కూటర్ ను ఆపి వస్తువులు తీయడానికి ప్రయత్నించగా అందులోని పాము కాటు వేయడానికి బయటకు రావడంతో రైతు తో పాటు ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ రైతు కర్రతో పామును చాకచక్యంగా చంపడంతో సమస్య పరిష్కారం అయింది. రాత్రి ఆ రైతు పొలం వద్దకు స్కూటర్ తీసుకెళ్లి ఉంచడంతో ఆ పాము డిక్కీలో ఉండిపోయింది. ఉదయం తన పని మీద తంబళ్లపల్లెకు రావడంతో పాము డిక్కీ లో ప్రత్యక్షమైంది.
Reporter
Namitha News