నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు హెచ్చరించారు. కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన శిక్షలు తప్పవు. పందేల కోసం స్థలాలు ఇచ్చిన యజమానులను కూడా నిందితులుగా పరిగణించి కేసులు నమోదు చేస్తాం. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. పాత నేరస్తులపై ఇప్పటికే నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు స్తానిక పోలీస్ స్టేషన్ కు లేదా 'డయల్ 112' కు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. జిల్లా ప్రజలకు, పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు ఎస్పీ గారు భోగి సంక్రాంత్రి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
Admin
Namitha News