నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర,, క్లస్టర్ ఇంచార్జిలు బేరి శ్రీనివాసులు, కాల నారాయణ, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు కేశవరెడ్డి,తరుగు శివారెడ్డి, జయరాం రెడ్డి,సీనియర్ బిసి నాయకులు కృష్ణమూర్తి,శివరాం, హరికృష్ణ, శేఖర్ రెడ్డి, పురుషోత్తం,ఆనంద్,సోమశేఖర్,రాజంపేట టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సోమశేఖర్, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,గ్రామ కమిటీ అధ్యక్షులు శివకృష్ణ, సురేంద్ర, మదనమోహన్, బావ జాన్, వెంకటరమణ, అశోక్, సుధాకర్, చెరువు సంఘం అధ్యక్షులు ఆదిరెడ్డి, కోటకొండ చిన్నరెడ్డప్ప, రామలింగారెడ్డి,మదనమోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ మణి, రామాంజులు, శ్రీనివాసులు,వెంకటరమణ ,పెద్ద వీరభద్ర, ఐసుల కృష్ణ,అల్లావుద్దీన్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News