Friday, 31 July 2026 01:01:28 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఎర్రచందనం, చెక్కలపై రాజా-రాణి బొమ్మలు లకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన మిట్స్

Date : 06 February 2026 07:59 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : దక్షిణ భారతదేశం అంతటా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన, ఎర్రచందనంతో తయారు చేసిన శతాబ్దాల నాటి తిరుపతి జిల్లాలోని లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మలకు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లె లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) వారు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చెన్నై జీఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. లక్ష్మీగారిపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ప్రసిద్ధి చెందాయి అని మరియు సాంప్రదాయకంగా పెళ్లికూతుళ్లకు వివాహ బహుమతిగా ఇస్తారు అనిఇవి వారి బొమ్మల కొలువు సేకరణలో మొదటి భాగంగా ఉంచుతారని ఆయన అన్నారు. రిజిస్ట్రీకి సమర్పించిన పత్రాల ప్రకారం, లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మల కళ తిరుపతి జిల్లాలోని సెట్టిగుంట పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది అని, ఈ జీఐ దరఖాస్తును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్టిస్టిక్ వుడెన్ టాయ్స్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరు పై దాఖలు చేసినట్లు ఆయనన్నారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమం లో అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :