నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 30 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాదెండ్ల భాస్కరరావు మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్న ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం ఈ మేరకు అన్నమయ్య జిల్లా లోని జనసేన ముఖ్య నాయకులు హైదరాబాదు లోని మంత్రి మనోహర్ నివాసంలో నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాదెండ్ల కుమారుడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ముఖ్య నేత మరియు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఈ సందర్భంగా పరామర్శించారు. వివిధ అంశాలపై మాట్లాడిన అనంతరం వీరు మంత్రి మనోహర్ కు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ కన్వీనర్ రాందాస్ చౌదరి, మదనపల్లి ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం, తంబళ్లపల్లి జనసేన నేత చంద్రశేఖర్ రెడ్డి, పలమనేరు ఆకుల గజేంద్ర, దిలీప్, అడపా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News