నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సంజీవ్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం. విజయ్ అనే వ్యక్తి ఆత్మకూరు విద్యుత్ శాఖ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మకూరు బ్రాంచ్ నందు శాలరీ ఖాతా కలిగి ఉన్నాడు.. ప్రభుత్వం నుండి వచ్చే జీతాన్ని బ్యాంకులో పడేవిధంగా ఖాతా రూపొందించారు. ఇదే క్రమంలో గత మూడు నెలల క్రితం విజయ్ ఉద్యోగ విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో బ్యాంకు నందు శాలరీ ఖాతా ద్వారా ఇతనికి ₹కోటి రూపాయలు మంజూరు కాగా నేడు ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ ఆధ్వర్యంలో మరణించిన విజయ్ భార్య అరుణకు వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఖాతాదారులకు ఎస్బిఐ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని రీజనల్ మేనేజర్ మరియు ఇతర సిబ్బంది తెలిపారు.. ఈ కార్యక్రమంలో SBI నెల్లూరు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ తో పాటు SBI చీఫ్ మేనేజర్ సీతారామశర్మ, ఆత్మకూరు SBI బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ మున్వర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ షరీఫ్ ఇతర సిబ్బంది హాజరయ్యారు
Reporter
Namitha News