Thursday, 30 July 2026 11:14:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేయాలి - సీపీఐ

జనవరి 4న జరిగే భూ పోరాట సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప

Date : 03 December 2025 10:51 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 03: బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలు తదితర భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున సాగు భూమిని పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని మొరవపల్లి ఎస్సీ కాలనీ నందు, సిపిఐ బీరంగి శాఖ సమావేశం, శాఖ కార్యదర్శ పి. నారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టి. కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు హాజరై ప్రసంగించారు.బీరంగి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు పెద్ద పెద్ద భూస్వాముల కబంధ హస్తాలలో పెట్టుకొని అనుభవించుకుంటూ ఉన్నారని, వారి చెర నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని అన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని వారందరికీ మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి పక్కా గృహ నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని, అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళ,డప్పు కళాకారులు తదితర పింఛన్లను పంపిణీ చేయడం లేదని,వెంటనే వీరందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2026 సంవత్సరం జనవరి 4వ తేదీన బీరంగి గ్రామంలో సోంపురాళ్ల మిట్ట వద్ద భూ పోరాట సదస్సు జరుగుతుందని, ఈ యొక్క సదస్సుకు సిపిఐ రాష్ట్ర పార్టీ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం రాష్ట్ర నాయకులు,జిల్లా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారని,ఈ యొక్క సదస్సులో పేదలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి.లక్ష్మన్న,జి. శంకర,ప్రసాదు,గంగన్న, వెంకటరమణ,వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, మంజుల, మమత, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :