నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 03: బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలు తదితర భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున సాగు భూమిని పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని మొరవపల్లి ఎస్సీ కాలనీ నందు, సిపిఐ బీరంగి శాఖ సమావేశం, శాఖ కార్యదర్శ పి. నారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టి. కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు హాజరై ప్రసంగించారు.బీరంగి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు పెద్ద పెద్ద భూస్వాముల కబంధ హస్తాలలో పెట్టుకొని అనుభవించుకుంటూ ఉన్నారని, వారి చెర నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని అన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని వారందరికీ మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి పక్కా గృహ నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని, అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళ,డప్పు కళాకారులు తదితర పింఛన్లను పంపిణీ చేయడం లేదని,వెంటనే వీరందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2026 సంవత్సరం జనవరి 4వ తేదీన బీరంగి గ్రామంలో సోంపురాళ్ల మిట్ట వద్ద భూ పోరాట సదస్సు జరుగుతుందని, ఈ యొక్క సదస్సుకు సిపిఐ రాష్ట్ర పార్టీ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం రాష్ట్ర నాయకులు,జిల్లా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారని,ఈ యొక్క సదస్సులో పేదలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి.లక్ష్మన్న,జి. శంకర,ప్రసాదు,గంగన్న, వెంకటరమణ,వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, మంజుల, మమత, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News