నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 ః తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ స్కూల్ ఏర్పాటు నుండి ప్రతి ఏటా టెన్త్ విద్యార్థులు త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం పరిపాటి. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో ఓ విద్యార్థిని టెన్త్ లో అసమాన ప్రతిభ కనబరిచి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఓ ఆణిముత్యం ఎంపికై పాఠశాలకు ఆదర్శంగా నిలిచింది. మోడల్ స్కూల్లో తంబళ్లపల్లెకు చెందిన బి. ఆశ గత టెన్త్ క్లాస్ పరీక్షల్లో 541/600 మార్కులు సాధించడంతో ఆ బాలిక శ్రీకాకుళం త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. ఆశ త్రిబుల్ ఐటీ ఎంపికపై మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, పాఠశాల కమిటీ బృందం ఆశ ను ప్రశంసలతో ముంచెత్తారు. మోడల్ స్కూల్ నుండి ఆశ త్రిబుల్ ఐటీ ఎంపిక పై ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం చేసిన కృషిని అభినందిస్తూ ఇదే వరవడితో భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నతికి సహకరించాలని ఆకాంక్షించారు
Reporter
Namitha News