నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తంబళ్లపల్లె జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు సూచించారు. గురువారం తంబళ్లపల్లె ఇంచార్జ్ సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి కూటమి పార్టీలతో సమన్వయంతో తంబళ్లపల్లె అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట జనసేన సీనియర్ నాయకుడు ఎద్దుల నరసింహులు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News