Thursday, 30 July 2026 10:31:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లె సుందరీకరణకు రూ.20 లక్షలు బహుద కాలువ గట్లపై ఇనుప బ్యారిగేట్లు.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 17 May 2026 05:52 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సుందరీకరణకు రూ.20 లక్షలు బహుద కాలువ గట్లపై ఇనుప బ్యారిగేట్లు.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా కేంద్రంగా అభివృద్ధి దిశగా మదనపల్లె పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని బహుద కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇనుప బ్యారిగేట్లు, పూల కుండీలతో అలంకరించిన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బహుద కాలువ గట్లపై ఐదు ప్రాంతాల్లో రూ.20 లక్షల వ్యయంతో ఇనుప బ్యారిగేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ అందాన్ని పెంచేలా పూల మొక్కలను కుండీల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రోడ్ల విస్తరణ పనులతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు పట్టణ రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన పలు సమస్యలను ప్రస్తుతం దశలవారీగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ రహిత మదనపల్లె లక్ష్యంగా ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి సహకరించాలని కోరారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత డ్రైనేజీలను పునర్నిర్మిస్తూ పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మదనపల్లె అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే, పనుల అమలులో కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల తో పాటు సంబంధిత అధికారులను అభినందించారు. అభివృద్ధి పనుల ద్వారా మదనపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :