నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 24 : తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లి పంచాయతీ మదనపల్లె, తంబళ్లపల్లె ప్రధాన రహదారిలో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఎనిమిదవ వార్షికోత్సవాన్ని స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు బురకాయలకోట మూర్తి స్వామి, చంద్రారెడ్డి స్వాములు అభిషేకం,ఆకుపూజ అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా పంచాలమర్రి, ఎర్రసానిపల్లి కు చెందిన వందలాది మంది భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో భక్తజన కళాకారులచే భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి మండలం నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
Reporter
Namitha News