Friday, 31 July 2026 04:53:27 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

Date : 25 January 2026 06:15 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25 : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 'నా భారత్ నా ఓటు' అనే నినాదంతో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బీటీ కళాశాల బీసెంట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముందు కలెక్టర్ కార్యాలయం నుంచి బీటీ కళాశాల వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ..యువత ఓటర్లుగా నమోదు కావడమే కాకుండా ప్రజాస్వామ్య బలోపేతానికి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన యువతకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక హక్కు మాత్రమే కాక బాధ్యత కూడా అని అధికారులు తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ ఎక్కువసార్లు ఓటు వేసిన సీనియర్ సిటిజన్లను దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. యువ ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారు.అలాగే వివిధ ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వంటి పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిఎస్డబ్ల్యుఓ లక్ష్మీపతి లతో కలిసి పురపాలక సంఘం అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :