నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె - మార్చి 03 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు అనంతపురము ద్రాక్ష పండ్లకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తేలిపారు. అనంతపురము ద్రాక్ష పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ముదురు రంగు, అధిక రసం, సమతుల్యమైన తీపి రుచి, తేలికపాటి పులుపు, మెత్తని గుజ్జు మరియు ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అనంతపురము ద్రాక్ష సాగుదారులు మరియు ఉత్పత్తిదారుల సంఘం చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపిఆర్ కార్యాలయానికి జి ఐ దరఖాస్తును సమర్పించిందని అన్నారు. ఈ దరఖాస్తు ద్వారా అనంతపురము ద్రాక్ష పండ్లను అనంతపురం భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన విలక్షణ వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా కోరుతున్నామని పేర్కొన్నారు. జి ఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చూడడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అనంతపురము ద్రాక్ష పండ్ల విలువను పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్కు దోహదపడిన అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ (AFLABT) ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్- రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ చెరుకూరి రవీంద్రనాథ్, ఉత్పత్తిదారుల కంపెనీ ప్రతినిధి బి. సర్వేశ్ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News