Friday, 31 July 2026 04:53:46 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్

తంబళ్లపల్లెలో ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం - ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్

Date : 05 June 2026 10:02 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 05 : దశాబ్దాలుగా సాగునీరు తో పాటు తాగునీరు కోసం కటకటలాడిన కరువు ప్రాంతానికి కూటమి ప్రభుత్వం ద్వారా మంజూరైన జల్ జీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి పథకం అందడం తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలకు ఓ వరం లా నిలిచింది.గత నాలుగు మాసాలుగా తంబళ్లపల్లె నియోజకవర్గం లో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు చొరవతో కాంట్రాక్టర్లను పురమయించి శరవేగంగా జరగడానికి చర్యలు చేపట్టారు. జల్జీవన్ మిషన్ పనులలో భాగంగా శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ రషీద్ ఖాన్, డి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లిలో 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు ఏ ఈఈ వినోద్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 54 ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరయ్యాయని అందులో తంబళ్లపల్లెకు 90వేల లీటర్లు, ఆర్ ఎం తండా పంచాయతీలో 60 వేల లీటర్లు సామర్థ్యంతో రెండు ట్యాంకులు, మండలంలో 40 వేల లీటర్ల సామర్థ్యంతో నాలుగు ట్యాంకులు, 20వేల సామర్థ్యంతో 33 ట్యాంకులు, 10వేల లీటర్ల సామర్థ్యంతో 15 ట్యాంకులు మొత్తం 54 ట్యాంకులు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులు ఉన్నతాధికారుల సూచనల మేరకు ట్యాంకుల పనులు పారదర్శకంగా వేగవంతంగా, నాణ్యత లోపం లేకుండా నిర్మించి భవిష్యత్తులో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి కృషి చేస్తామన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికే దక్కినట్లు జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ, మాజీ సర్పంచులు కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమల్ రెడ్డి, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్, జగదీష్, జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు, బిజెపి నాయకుడు ఎద్దుల లక్ష్మీపతి లు కొనియాడారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :