నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 29 : రామసముద్రం మండలం లోని ఆర్. నడింపల్లి గ్రామంలో నేడు అంగరంగ వైభవంగా జరిగిన గ్రామదేవత గంగమ్మ జాతర సందర్బంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు కు మండలంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తల బ్రాహ్మరధం పట్టుతూ ఘనంగా స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులుఅందుకున్నారు. జాతర నేపథ్యంలో హాజరైన ప్రజలు , స్థానిక నేతలు, కార్యకర్తలతో మమేకమైయ్యారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపి అధ్యక్షులు విజయ్ గౌడ్, మాజీ అధ్యక్షులు నారాయణ రెడ్డి , కృష్ణంరాజు , రామచంద్ర, డా.శివ, ఆనంద్, వేమారెడ్డి, శంకర్, రాజు,, శ్రీనాథ్, రాజశేఖర్, హేమంత్ తదితరులు హాజరయ్యారు
Reporter
Namitha News