నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - నవంబర్ 10 : భారతదేశ అభివృద్ధి కి యువత స్ఫూర్తి తో ముందుకు రావాలని ప్రముఖ సినీ నటుడు ఆలీ అన్నారు. కడపలో జరిగిన అమీన్ పీర్ పెద్దదర్గా ఉత్సవాలకు హాజరైన సినీ నటుడు ఆలీని పీలేరు నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. సర్వ మతాల సమాహారంగా విరాజిల్లుతున్న మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, ముఖ్యంగా సామరస్యాన్ని, సోదర భావాన్ని అలవర్చుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుందని, నాటి జాతీయ నాయకుల కలలు, ఆశయాలను సాఫల్యం చేసే దిశగా యువత నడుచుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో యువత, విద్యార్థుల పాత్ర కీలకమైనదని, యువత తలుచుకుంటే ఏది అసాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు సర్పంచ్ హబీబ్ బాషా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్,కేంద్ర ఉక్కు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అలీ భాయ్, నాయకులు ఆబీద్, కాలేషా,జాకీర్, అమిన్ పీర్, సమీ, ఇమ్రాన్, యూసుఫ్, హరిప్రసాద్ రెడ్డి, రమణ, మణి పాల్గొన్నారు
Reporter
Namitha News