Thursday, 30 July 2026 01:52:52 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గుడియవాండ్లపల్లి హరజన వాడ లో "అక్షర ఆంధ్ర - ఉల్లాస్" కార్యక్రమం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 05 February 2026 09:22 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి - ఫిబ్రవరి 05: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుడియవాండ్లపల్లి లోని హరిజనవాడలో జరుగుతున్న అక్షర ఆంధ్ర - ఉల్లాస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఏ మెప్మా వంటి శాఖల సమన్వయంతో 15 సంవత్సరాల పైబడిన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్ హెచ్ జి లబ్ధిదారులు, ఆయాలు, వంట వండేవారు, వివిధ రకాల సహాయకులు, వివిధ కార్యాలయాల కాపల దారులు, తదితరులను అక్షరాస్యులుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్..... "అక్షర ఆంధ్ర - ఉల్లాస్" కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ హెచ్ జి సంఘం సభ్యులతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, ఎంత కాలం నుండి అక్షర ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు, కార్యక్రమాన్ని ఏ ఏ రోజులలో నిర్వహిస్తున్నారు, కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఎస్ హెచ్ జి గ్రూపులోని వారందరికీ చూపిస్తున్నారా లేదా, కార్యక్రమంలో ఎన్ని గంటల పాటు చదువుకుంటున్నారు వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు అక్షరాస్యులుగా అయ్యేందుకు ఈ కార్యక్రమంలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :