Saturday, 13 June 2026 09:58:05 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన

Date : 10 June 2026 10:42 PM Views : 29

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 10 : తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో హార్టికల్చర్ కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత నివ్వాలని ఏపీ డి చందన సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన క్షేత్ర సహాయకులు సమీక్షలో ఆమె మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార, జలహారతి పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి సాగునీటి చెరువులు నీటితో కళకళలాడాలని సూచించారు. ఉపాధి హామీలు హార్టికల్చర్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో రైతులు కోరిన పండ్ల మొక్కల పెంపకానికి రైతులతో మాట్లాడి ఒప్పించాలన్నారు. మండలంలో మొదటి ప్రాధాన్యత క్రమంలో 200 ఎకరాలలో పండ్ల మొక్కల పెంపకానికి క్షేత్ర సహాయకులు కృషి చేయాలన్నారు. మండలంలో జలధార, జలహారతి కార్యక్రమంలో జరిగే ప్రతి పని ప్రతి నీటి బొట్టు సంరక్షణే ధ్యేయంగా పనులు చేయించాలన్నారు. ఎంపీడీవో ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార,జలహారతి పనుల నిర్వహణ పై అభినందిస్తూ మిగిలిన పనులు పూర్తిచేసి జల సంరక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, సరస్వతి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :