నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద జనవరి 4న జరగనున్న హిందూ సమ్మేళనానికి హాజరుకావాలని హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డిపల్లి, పెద్దకురుపల్లి, నారే వారి పల్లి, మట్లవారిపల్లె గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించారు. మల్లిఖార్జున స్వామి మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు .హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిలుగా ప్రభాకర్ రాజు ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ప్రభోధన్ శ్రీ శ్రీ పూజ్యశ్రీ మాతంగనందగిరి స్వామిజి, నిత్యముక్తాదాస్, సుదర్శన్ కృష్ణదాస్, శివరాం దాస్ వస్తారన్నారు. ఈకరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మల్లిఖార్జున స్వామి,నాగభూషణం శట్టి, రవీంద్రనాథ్ రెడ్డి,సుదర్శన్,వెంకటరమణ రాజు శ్రీనివాసులు రెడ్డి, దామోదర్ రెడ్డి, జనసేన సూరీ, చలపతి, పవన్, కృష్ణమూర్తి, వెంకటేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News