నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాత్రికరెడ్డికి రూ.3 లక్షల PMNRF నిధులు -- ఎంపి మిథున్ రెడ్డి చొరవతో మంజూరు -- శాంక్షన్ లెటర్ అందజేసిన నిస్సార్ అహమ్మద్ బోన్ మ్యారో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి గాత్రికరెడ్డి వైద్య ఖర్చుల కోసం రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ప్రదానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. గురువారం అవెన్యూ రోడ్డులోని వైసిపి కార్యాలయంలో సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ చేతులమీదుగా రూ.3 లక్షల శాంక్షన్ లెటర్ చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కుల,మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా సహాయం చేయడానికి పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి ఎల్లప్పుడూ సిద్దంగా వుంటారని కొనియాడారు. చిన్నారి గాత్రికరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతు వెలూరు సిఎంసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం ఎంపి మిథున్ రెడ్డి ని కోరగా పిఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని వివరించారు. ఈ మొత్తం డైరెక్ట్ గా ఆసుపత్రికి బదిలీ చేస్తారని, పిఎంవో నుంచి నిధులు మంజూరు అయినట్లు వచ్చిన శాంక్షన్ లెటర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు ఎంపి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News