నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 09 : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండ కిట్టలను రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు కొండామర్రి తులసీదర్ నాయుడు సూచించారు. సోమవారం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈఓతో సమావేశమై ప్రభుత్వం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.కొండపై తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూ లైన్లు, మహిళలకు ప్రత్యేక క్యూ, భద్రత, భోజన వసతి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈవో స్పందిస్తూ ఇప్పటికే కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 80 మంది పోలీసులు, 50 నుండి 60 మంది వాలంటీర్లు, ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటుతోపాటు భోజన వసతి కి చర్యలు చేపట్టినట్లు చెప్పారు
Reporter
Namitha News