నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామ రైతుసేవా కేంద్రంలో మంగళవారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఈసారి సమయానుకూలంగా అందించడంతో గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని టిడిపి నాయకులు రెడ్డప్ప, మనోజ్ అధికారులు కలిసి ప్రారంభించి రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులు ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. వానాకాలం పంటలు సకాలంలో వేసుకునేందుకు ఉలవల పంపిణీ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి అర్హుడైన రైతుకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్దరెడ్డప్ప, చిన్నరెడ్డప్ప, మనోజ్, సందీప్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News